రాజంపేటలో వైకాపాకు భారీ షాక్!
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు.
వందలాది మంది తెదేపాలో చేరిక
వరుస కడుతున్న కీలక నాయకులు
ఈనాడు, కడప, న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు. ఇంకా కొంతమంది కీలక నేతలు గురువారం పార్టీలో చేరేందుకు రాజంపేట నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. ఇదే బాటలో మరికొందరున్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వైకాపా టిక్కెట్టు ఇవ్వకపోవడం, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడని కొందరు తెదేపాలో చేరాలనే అభిప్రాయానికి వచ్చారు. రాజంపేటలో దాదాపు వైకాపా కీలక నేతలందరూ తెదేపాలోకి దూకేస్తున్నారు. ఎమ్మెల్యే మేడా సైతం వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెదేపా అధికారంలోకి వస్తుందనే ధీమాతోనూ వైకాపా నేతలు అక్కడి నుంచి జారిపోతున్నారు. ఈ నెల 24న రాజంపేటలో జరిగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలో మిగిలిన కీలక నేతలందరూ పార్టీలో చేరనున్నారు. నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, రాజంపేట మండలాల్లో వైకాపా పూర్తిగా ఖాళీ అయిపోయినట్లయింది. వైకాపాలో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలు సైతం పార్టీని వీడిపోతున్నారు. వైకాపా నేతలందరినీ తెదేపాలో చేర్పించడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, పోలి సుబ్బారెడ్డి కంకణం కట్టుకున్నారు. రాజంపేట పురపాలక సంఘంలో పలువురు వైకాపా కౌన్సిలర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం ఆకేపాటి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నారా లోకేశ్ సమక్షంలో రాజంపేట మండలం చెర్లోపల్లి, మందరం, మదనగోపాలపురం నుంచి దాదాపు 100 మంది వరకు తెదేపాలో చేరారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శరత్కుమార్ రాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యంరాజు, మదనగోపాలపురం సర్పంచి పెంచలయ్య, చెర్లోపల్లి ఉప సర్పంచి కొండూరు నరసింహరాజు, రామరాజు, న్యాయవాది సుబ్బరాజు, వైకాపా మండల సీనియర్ నేత విశ్వనాథ్రాజు, రవిరాజు తదితరులు చేరారు. రాజంపేట పట్టణంలోని మైనార్టీ నాయకుడు, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గండికోట గుల్జార్ భాషా, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య, వక్ఫ్బోర్డు కార్యదర్శి సయ్యద్ అమీర్ బుధవారం వారి పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు లేబాక సర్పంచి వెంకటనర్సయ్య, నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచి సూర్యనారాయణ, ఆడకూరు ఉప సర్పంచి రమేష్ బాబురాజు, టంగుటూరు ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి భర్త పెంచలయ్య హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. రాజంపేట పురపాలక సంఘం నుంచి 8 మంది కౌన్సిలర్లు వైకాపా నుంచి తెదేపాలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర