Telangana News: గోనెసంచి తెచ్చిన తంటా.. 24 గంటల పాటు అంధకారంలో గోపాల్పేట
ఓ గోనెసంచి ఏకంగా గోపాల్పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన
విద్యుత్తు స్తంభంపై లేచిన మంటలు
గోపాల్పేట, న్యూస్టుడే : ఓ గోనెసంచి ఏకంగా గోపాల్పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన గోపాల్పేటలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి ముందు సాయంత్రం నుంచి ఈదురుగాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. అయితే రాత్రి సుమారు 12 గంటల సమయంలో మళ్లీ గాలిదుమారంతో విద్యుత్తు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఫ్యాన్లు తిరగక.. ఏసీలు పనిచేయకపోవడంతో పలువురు మేల్కొన్నారు. కరెంటు ఎందుకుపోయిందో ట్రాన్స్కో సిబ్బందికి కూడా అర్థం కాలేదు. అదే సమయంలో బస్టాండు ప్రాంతం నుంచి సిబ్బందికి ఫోన్ వచ్చింది. విద్యుత్తు తీగలపై గోనెసంచి పడి మంటలు లేస్తున్నాయని కొందరు చెప్పారు. బస్టాండు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పిల్లరుకు చుట్టిన గోనెసంచి గాలిలో ఎగిరివచ్చి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలపై పడింది. ఆ వెంటనే తీగల నుంచి మంటలు లేచాయి. అవి తెగిపడ్డాయి. ఫలితంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది వచ్చి సరిచేయాలని ప్రయత్నించినా రాత్రి కావడంతో సాధ్యం కాలేదు. శనివారం తెల్లవారుజాము నుంచే మరమ్మతు పనులు ప్రారంభించి ఉదయం 10 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. ఒక గంటసేపు ఉన్న కరెంటు మళ్లీ పోయింది. ఓ గంటకు మళ్లీ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సరఫరా నిలిచిపోయింది. ఇలా నాలుగైదుసార్లు కరెంటు రావడం.. పోవడంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాత్రంతా విద్యుత్తు లేక నిద్రపోలేదు. ఇంట్లో నీళ్లు లేవు, మోటర్లు వేద్దామంటే కరెంటు లేదు. అంటూ విద్యుత్తు సిబ్బందికి ఫోన్లు వచ్చాయి. ఇలా సాయంత్రం 4 గంటల వరకు కరెంటు కష్టాలు ఎదురయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.