Telangana News: గోనెసంచి తెచ్చిన తంటా.. 24 గంటల పాటు అంధకారంలో గోపాల్పేట
ఓ గోనెసంచి ఏకంగా గోపాల్పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన
విద్యుత్తు స్తంభంపై లేచిన మంటలు
గోపాల్పేట, న్యూస్టుడే : ఓ గోనెసంచి ఏకంగా గోపాల్పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన గోపాల్పేటలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి ముందు సాయంత్రం నుంచి ఈదురుగాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. అయితే రాత్రి సుమారు 12 గంటల సమయంలో మళ్లీ గాలిదుమారంతో విద్యుత్తు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఫ్యాన్లు తిరగక.. ఏసీలు పనిచేయకపోవడంతో పలువురు మేల్కొన్నారు. కరెంటు ఎందుకుపోయిందో ట్రాన్స్కో సిబ్బందికి కూడా అర్థం కాలేదు. అదే సమయంలో బస్టాండు ప్రాంతం నుంచి సిబ్బందికి ఫోన్ వచ్చింది. విద్యుత్తు తీగలపై గోనెసంచి పడి మంటలు లేస్తున్నాయని కొందరు చెప్పారు. బస్టాండు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పిల్లరుకు చుట్టిన గోనెసంచి గాలిలో ఎగిరివచ్చి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలపై పడింది. ఆ వెంటనే తీగల నుంచి మంటలు లేచాయి. అవి తెగిపడ్డాయి. ఫలితంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది వచ్చి సరిచేయాలని ప్రయత్నించినా రాత్రి కావడంతో సాధ్యం కాలేదు. శనివారం తెల్లవారుజాము నుంచే మరమ్మతు పనులు ప్రారంభించి ఉదయం 10 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. ఒక గంటసేపు ఉన్న కరెంటు మళ్లీ పోయింది. ఓ గంటకు మళ్లీ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సరఫరా నిలిచిపోయింది. ఇలా నాలుగైదుసార్లు కరెంటు రావడం.. పోవడంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాత్రంతా విద్యుత్తు లేక నిద్రపోలేదు. ఇంట్లో నీళ్లు లేవు, మోటర్లు వేద్దామంటే కరెంటు లేదు. అంటూ విద్యుత్తు సిబ్బందికి ఫోన్లు వచ్చాయి. ఇలా సాయంత్రం 4 గంటల వరకు కరెంటు కష్టాలు ఎదురయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
[ 05-05-2024]
ఎర్రవల్లిలో ఆదివారం నిర్వహించిన సీఎం జన జాతర సభకు మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. -
విద్యుత్ నియంత్రికలను బాగు చేశారు
[ 05-05-2024]
మండలకేంద్రమైన రాజోలి పునరావాస గృహాల వద్ద విద్యుత్తు సమస్య నెలకొందంటూ 'తరచూ కాలిపోతున్నాయ్!' అనే శీర్శికతో ఈనాడులో ఈ నెల 3న కథనం ప్రచురితమైంది. -
భాజపాకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతు
[ 05-05-2024]
భాజపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 05-05-2024]
భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు
[ 05-05-2024]
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి ఆరోపించారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్ తేల్చి చెప్పారు. -
నేడు ఎర్రవల్లిలో జనజాతర
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. -
మాటలతో మోసం చేశారు: చల్లా
[ 05-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక వాణి పాలమూరు బాణి
[ 05-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. -
నల్లమలకు చేరిన చిరుత
[ 05-05-2024]
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. -
వడ్డేపల్లి @ 46 డిగ్రీలు
[ 05-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. -
హస్తం దెబ్బకు కారు షెడ్డుకు
[ 05-05-2024]
భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. -
హోం ఓటింగ్కు 1,026 మందే దరఖాస్తు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
[ 05-05-2024]
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. -
భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి
[ 05-05-2024]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ : మన్నె
[ 05-05-2024]
రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. -
మరికల్లో భారీ చోరీ
[ 05-05-2024]
మరికల్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. -
ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
[ 05-05-2024]
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!