logo

Hyderabad News: పెళ్లయిన ఇరవై రోజులకే..రెండో వివాహం

పెళ్లయిన ఇరవై రోజులకే ఓ ప్రభుద్ధుడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా సంసారాన్ని సాగిస్తున్నాడు. కొద్ది కాలం తరువాత విషయం మొదటి భార్యకు

Updated : 29 Apr 2022 08:37 IST

మొయినాబాద్‌: పెళ్లయిన ఇరవై రోజులకే ఓ ప్రభుద్ధుడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా సంసారాన్ని సాగిస్తున్నాడు. కొద్ది కాలం తరువాత విషయం మొదటి భార్యకు చెప్పాడు. రెండో వివాహం చేసుకున్న అమ్మాయి తనను బ్లాక్‌మెయిల్‌ చేసిందని.. ఎలాగోలా ఆమె బారినుంచి బయటపడతానంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. చివరకు మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మొయినాబాద్‌ ఠాణా పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. ఎస్సై శిరీష వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మురళీ(28)కు, నవంబరు 25, 2021లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన లావణ్యతో వివాహమైంది. అనంతరం మురళీ అదే ఏడాది డిసెంబరు 13న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల అత్త, ఆడపడుచులతో పాటు భర్త మురళీ వేధింపులకు గురిచేయడంతో లావణ్య గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని