logo

జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం

జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్‌ నాగమణి బుధవారం తెలిపారు.

Published : 25 Apr 2024 02:04 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్‌ నాగమణి బుధవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి జూన్‌ 30 వరకు కొనసాగుతుందన్నారు. నాలుగో తరగతి నుంచి పై విద్యార్థులకు ఒక్కో బ్యాచ్‌లో 15 నుంచి 30 మందికి ఒక రోజు శిబిరం ఉంటుందన్నారు. జూకు సంబంధించిన జంతువులు, వాటి ఆవాసాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్నాక్స్‌ ఇస్తామన్నారు. జూ లోగో క్యాపు, కిట్‌ అందిస్తారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు చరవాణి 77992 92607.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని