శ్రీసూర్యనారాయణా.. తేజోమయా
నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.
నేడు రథసప్తమి
నందికొట్కూరులోని సూర్యనారాయణ స్వామి ఆలయం
నందికొట్కూరు, న్యూస్టుడే: నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సూర్యారాధన చేసినవారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు గాలిగోపురంగుండా మంటపాన్ని దాటుకుని గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహం వక్షస్థలాన్ని తాకుతాయి. ప్రతి ఆదివారం వందలాది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి యాగాలు నిర్వహిస్తారు. పదమూడో శతాబ్దంలో చోళ వంశీయుడైన సిరిసింగరాయుడు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడని, అలసటతో అక్కడే ఉన్న ఓ వృక్షం కింద నిద్రిస్తుండగా సూర్యనారాయణస్వామి కలలోకి వచ్చి నిద్రిస్తున్న ప్రాంతంలో తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించినట్లు స్థలపురాణం ప్రచారంలో ఉంది. ఆలయంలో కూర్మ యంత్రం ఉండటం విశేషం. మూలవిరాట్ కుడిచేతుల్లో తెల్లటి పద్మం, ఎడమచెయ్యి అభయముద్రలో ఉంటుంది.
28న కల్యాణోత్సవం
ఈనెల 28వ తేదీన రథసప్తమి, సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఛాయా ఉషాసమేత సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు స్వామి అభిషేకం, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కుంకుమార్చన, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. సాయంత్రం 3 గంటలకు పురవీధుల గుండా కల్యాణమూర్తుల రథోత్సవం నిర్వహిస్తారు.
స్వామి మూలవిరాట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలింగ నర్తనోత్సవ అలంకరణలో అహోబిలేసుడు
[ 20-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఇసుక క్వారీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 20-05-2024]
మండలంలోని ముడుమాల, పల్దొడ్డి, ఈర్లదిన్నె, కె.సింగవరం గ్రామాల్లోని ఇసుక క్వారీలను సోమవారం జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
[ 20-05-2024]
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ