శీతాకాలంలో చైనా సరిహద్దులు భగభగ..!
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతిభేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమేకానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు
* ఏర్పాట్లలో తలమునకలైన భారత సైన్యం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతి భేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమే కానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. కానీ, చైనా మాత్రం సరిహద్దుల సమీపానికి ఆయుధాల తరలింపు ఏమాత్రం తగ్గించలేదు. దీంతో భారత దళాలు చైనాను నమ్మి వెనక్కి తగ్గే అవకాశం లేదు. దీంతో ఈ సారి శీతాకాలం కూడా వెనక్కి తగ్గకూడదని సైన్యం నిర్ణయించింది. దీంతో కీలక స్థానాల్లో, పర్వతాలపై పట్టు కొనసాగించాలని నిర్ణయించుకొంది. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకొంటోంది.
ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్ డిపోల ఏర్పాటు..!
లద్దాఖ్లో వాడేందుకు అవసరమైన ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్ను సైన్యం సమకూర్చుకుంటోంది. అతి శీతల ప్రదేశాల్లో సాధారణ డీజిల్లోని పారఫిన్ వ్యాక్స్ చిక్కబడిపోతుంది. ఫలితంగా వాహనాల ఇంజిన్లో ఇది ప్రవహించకుండా అడ్డుపడుతుంది. డీజిల్ పంపు నుంచి వాహన ట్యాంకులోకి కూడా దీనిని పంపించడం కష్టంగా మారుతుంది. కిరోసిన్ కలపడం, వేడిచేయడం వంటివి చేస్తే సమస్యలు వస్తాయి. అందుకే.. ఇటువంటి సమస్యలను అధికమించడానికి సైన్యం ప్రత్యేకంగా వింటర్ డీజిల్ను వాడుతుంది. ఇది మైనస్ 33 డిగ్రీల చలిలో కూడా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పానిపట్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తోంది.
దాదాపు 40వేల మంది సైనికుల శీతాకాల అవసరాలు తీర్చేలా భారీ అండర్ గ్రౌండ్ ఇంధన ట్యాంకులను సిద్ధం చేసింది. ఒక్కోదానిలో దాదాపు 4లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. కొన్ని ప్రత్యేక అవసరాల నిమిత్తం కిరోసిన్ కూడా నిల్వ చేస్తోంది. అంతేకాదు శీతాకాలంలో హిమ శిఖరాలు మరింత గడ్డకట్టుకుపోతాయి.. దీంతో సైన్యానికి తాగునీటికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ సమస్య నివారించడానికి నీటి వనరులను కూడా సైన్యం సమకూర్చుకుంటోంది. నీటి వనరులను గుర్తించడానికి సైన్యం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను నియమించింది. దౌలత్బేగ్ ఓల్డీ, డెప్సాంగ్, పాంగాంగ్ ప్రాంతాల్లో వీరు మంచినీటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
హిమగిరులకు జంబో విమానాలు
భారత్ వాయుసేన అమ్ములపొదిలో భారీ విమానాలు లద్దాఖ్ దిశగా క్యూకట్టాయి. సీ-17 గ్లోబ్మాస్టర్, ఐఎల్-76, సీ-130జే వంటి భారీ విమానాలు ఉపయోగించి సైన్యానికి అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 6,000 ట్రక్కులు రేషన్ను నిరంతరాయంగా చేరవేస్తున్నాయి. దుస్తులు, టెంట్లు, చమురు వంటి కీలకసామగ్రి వీటిల్లో ఉంటోంది.
మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్(ఏటీసీ)..
భారీ సంఖ్యలో యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్లు లద్దాఖ్ ప్రాంతానికి చేరుకోవడంతో.. లేహ్లోని ఏటీసీకి అదనంగా పలు మొబైల్ ఏటీసీలను ఏర్పాటు చేశారు. సైన్యం ఆధ్వర్యంలో మొబైల్ ఏటీసీలను ఇక్కడకు రప్పించారు. ఇవి టీవీ ఛానళ్లు వినియోగించే ఓబీ వ్యాన్లను పోలి ఉంటాయి.
కస్ఘర్కు చైనా బాంబరు..
మరోపక్క ఎల్ఏసీ సమీపంలోకి ఆయుధాల చేరవేతను చైనా మానలేదు. కారాకోరం పాస్కు 475 కిలోమీటర్ల దూరంలోని షిన్జియాంగ్ రీజియన్లోని కస్ఘర్ వైమానిక స్థావరంలో కీలక బాంబర్ విమానాలను మోహరిస్తోంది. హెచ్-6 బాంబర్లును ఇటీవల భారత్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణులు గుర్తించారు. వీటికి చైనాకు చెందిన కేడీ-63 క్రూజ్ క్షిపణులను అమర్చినట్లు గుర్తించారు. వీటిని గాల్లో నుంచి భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగిస్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబింగ్ చేయడానికి వాడతారు. ఇరు దేశాల సైనిక కమాండర్ల ప్రకటన తర్వాత ఈ క్షిపణులతో ఉన్న విమానాలు కనిపించడం సందేహాస్పదంగా మారింది. ఈ విమానాలు చైనా వాయుసేనకు చెందిన 36వ ఎయిర్ డివిజన్లోని 108 రెజిమెంట్కు చెందినవిగా భావిస్తున్నారు. ఇవన్నీ భారత్లో దాడులు చేయాలన్న చైనా ఉద్దేశాలను వెల్లడిస్తున్నాయి.
కొత్తగా 1959 నాటి చైనా ప్రీమియర్ ఝావో ఎన్లై ప్రతిపాదించిన ఎల్ఏసీని అంగీకరిస్తామని కొన్నాళ్ల క్రితం చైనా ప్రతినిధి ఒక ఆంగ్లపత్రికకు తెలిపారు. ఇది భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుత ఎల్ఏసీ ఆధారంగానే 1993, 1996, 2005లో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు దానిని గుర్తించకపోతే ఆ ఒప్పందాల అమలు అటకెక్కుతుంది. ఫలితంగా ఎల్ఏసీ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెంచాలనే చైనా ఉవ్విళ్లూరుతోంది.. అందుకే భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!