ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్ దీపాలు!
ఒక యుద్ధం వారికి నిలువ నీడ లేకుండా చేసింది.. దీంతో కట్టుబట్టలతో టిబెట్ నుంచి వచ్చి భారత్లో శరణార్థులుగా మారారు. ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆరు దశాబ్దాలు కావొస్తున్నా వారి గ్రామానికి విద్యుత్ సరఫరా లేదు. రాత్రి అయిందంటే కొవ్వొత్తి
ఇంటర్నెట్ డెస్క్: ఒక యుద్ధం వారికి నిలువ నీడ లేకుండా చేసింది.. దీంతో కట్టుబట్టలతో టిబెట్ నుంచి వచ్చి భారత్లో శరణార్థులుగా మారారు. ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆరు దశాబ్దాలు కావొస్తున్నా వారి గ్రామానికి విద్యుత్ సరఫరా లేదు. రాత్రి అయిందంటే కొవ్వొత్తి వెలుతురులో కాలం వెళ్లదీయాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న గ్రామానికి నలుగురు ఇంజినీర్లు వెలుగులు తీసుకొచ్చారు. ఆ విద్యుత్ కాంతులతో గ్రామ ప్రజల ముఖాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి.
లద్ధాఖ్లోని దుంగ్తి అనే గ్రామం భారత్, చైనా ఆధీనంలో ఉన్న భూభాగాన్ని వేరుచేసే వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంది. తొలి టిబెటన్ శరణార్థుల గ్రామంగా ఇది గుర్తింపు పొందింది. 1962లో చైనా.. భారత్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిన తర్వాత టిబెట్కు చెందిన 30 కుటుంబాలు భారత్కు వచ్చి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ, మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఆరు దశాబ్దాలుగా ఈ గ్రామ ప్రజలు చీకట్లోనే బతికేస్తున్నారు.
గ్రామంలో వెలుగులు నింపిన ఆ నలుగురు
గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్ అనే సంస్థ.. మారుమూల గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 100కుపైగా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఈ సంస్థలో ఉద్యోగులు పలుమార్లు దుంగ్తి గ్రామం గుండా వేరే ప్రాంతాలకు వెళ్లారు. కానీ.. ఈ గ్రామంవైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇటీవల షఖీర్ హుస్సేన్.. మరో ముగ్గురు ఇంజినీర్లు ఈ గ్రామంపై సర్వే చేశారు. దేశంలో తొలి టిబెటన్ శరణార్థుల గ్రామంగా పేరొందిన ఈ గ్రామంలో విద్యుత్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ గ్రామానికి సోలార్శక్తితో 8.6కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. దీంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ఇంట్లో మూడు ఎల్ఈడీ దీపాలు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం లభిస్తుంది. అలాగే పది సోలార్ ఎల్ఈడీ వీధిదీపాలు అమర్చారు. గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామం ఏర్పడిన 60 ఏళ్లకు అక్కడి ప్రజలు తొలిసారి విద్యుత్ కాంతులను చూశారు.
ఇంజినీర్ల కోసం గ్రామస్థుల త్యాగం
గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి తమకు ఐదు రోజులు పట్టిందని ఇంజినీర్లు చెప్పుకొచ్చారు. లేహ్ నుంచి దుంగ్తికి చేరుకోవడానికి ఏడు గంటలు సమయం పట్టిందట. సరైన దారి లేకపోవడంతో గ్రామానికి చేరుకోవడానికి, ఆ ఎముకలు కొరికే చలిలో విద్యుత్ సరఫరా కోసం తీగలు అమర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. అయినా ప్రజలు తమకు ఎంతో మద్దతిచ్చారని పేర్కొన్నారు. ‘‘దుంగ్తి గ్రామంలో ఒక్కో కుటుంబం కేవలం రెండు చిన్నగదుల్లో నివసిస్తున్నాయి. దీంతో మాకు ఉండటానికి చోటే లేదు. అయినా, వారు ఒక ఇంటిని ఖాళీ చేసి మాకు ఇచ్చారు. శీతాకాలంలో అక్కడ -30డిగ్రీల వరకు చలి ఉంటుంది. ఆ చలిలో మేం ఉండలేకపోయాం. అందుకే ప్రజలు మా కోసం రాత్రుళ్లు చలిమంట వేసి.. అది ఆరిపోకుండా తెల్లవారేదాక చూసుకునేవారు’’అని ఇంజినీర్లు చెప్పారు. ఎట్టకేలకే గ్రామానికి విద్యుత్ సౌకర్యం రావడంతో దుంగ్తి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!