Incontinence: అమ్మా.. మూత్రంపై పట్టు ఉండటం లేదా..? ఎందుకో తెలుసుకోండి..!
వయసుతో సంబంధం లేకుండా మూత్రం అదుపులో లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాం. చాలా వరకు మధుమేహం ఉన్న వాళ్లకే ఇలాంటి సమస్య వస్తుందని భావిస్తారు. కానీ మూత్రాశయంలో సమస్య తలెత్తితే మహిళలకు మూత్రంపై పట్టు ఉండక పెనుసవాల్గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వయసుతో సంబంధం లేకుండా మూత్రం అదుపులో లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాం. చాలా వరకు మధుమేహం ఉన్న వాళ్లకే ఇలాంటి సమస్య వస్తుందని భావిస్తారు. కానీ మూత్రాశయంలో సమస్య తలెత్తితే మహిళలకు మూత్రంపై పట్టు ఉండక పెనుసవాల్గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. పదిమందిలోకి వెళ్లడం, కార్యాలయాల్లో పని చేయడానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుందని గైనకాలజిస్టు డాక్టర్ మణి అక్కినేని వివరించారు.
ఇలా ఎందుకవుతుందంటే...
మూత్ర విసర్జన ఎంత ముఖ్యమో దానిపై పట్టు అంతే అవసరం. మూత్ర విసర్జన సులువైన పని కాదు..మూత్రాశయం, మూత్ర మార్గ కండర వలయం, కటి కండరాలు, నాడులు అన్నీ కలిసి సమన్వయంతో పని చేస్తేనే విసర్జన ప్రక్రియ సజావుగా సాగుతుంది. కిడ్నీలలో తయారైన మూత్రం నాళాల ద్వారా మూత్రాశయంలోకి వచ్చి చేరుతుంది. మూత్రం విసర్జించేదాకా అందులో ఉండిపోతుంది. మెదడుకు సంకేతాలు వెళ్లిన తర్వాతే విసర్జన సాఫీగా సాగిపోతుంది. ఏ భాగమైన సరిగా పని చేయకపోతే నవ్వినా, దగ్గినా మూత్రం పడిపోతుంది. 30 ఏళ్లు దాటిన వారికి, మెనోపాజ్ తర్వాతగానీ ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. 50 ఏళ్లు దాటిన మహిళల్లో 70 శాతం ఈ ఇబ్బందులుంటాయి. పిల్లలను కనడంతో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.
ఏం చేయాలంటే..!
మూత్రంపై పట్టులేని మహిళలకు వైద్యం కూడా అందుబాటులో ఉంది. దీనికి సిస్టాస్కోపీతో మూత్రాశయంలోని పరిస్థితిని తెలుసుకుంటాం. పాలిప్స్, ఇతర కారణాలేమైనా ఉంటే చికిత్స చేయవచ్చు. కండరాలను గట్టిపడేలా కొన్ని వ్యాయామాలను సూచిస్తాం. దీంట్లో ప్రధానంగా కీగెల్ వ్యాయామం ఒకటి. వీటిని చేయడంతో మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రకాల శస్త్రచికిత్సలు అవసరమైతే చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్