Top Ten News @ 1 PM
కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఈరోజు, మరికొన్నిచోట్ల రేపు కూడా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్ టీకా రెండో డోస్ వేయించుకోవాల్సిన
1. Coronavaccine:పలు జిల్లాల్లో నిలిపివేత
కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఈరోజు, మరికొన్నిచోట్ల రేపు కూడా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్ టీకా రెండో డోస్ వేయించుకోవాల్సిన వారి జాబితా తయారు చేస్తుండగా జిల్లాలో రెండ్రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు అక్కడి వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
*Coronavaccine: కేంద్రాల వద్ద బారులు
2. సరిహద్దు వద్ద ఏపీ కొవిడ్ అంబులెన్స్లు అడ్డగింత
ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కొవిడ్ అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్లను వెనక్కి పంపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు
కరోనా రక్కసి కాటుకు యావత్ దేశం చిగురుటాకులా విలవిల్లాడుతోంది. లక్షల మందిపై మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Vaccine విధానంలో కోర్టు జోక్యం తగదు
కరోనా వ్యాక్సిన్ ధరలు, టీకాల కొరతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కొవిడ్ వ్యాక్సినేషన్ విధానాన్ని కేంద్రం సమర్థించింది. ప్రస్తుత మహమ్మారి సంక్షోభం వేళ ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణులు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని తెలిపింది. ప్రజాప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 218 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. TNR: కరోనాతో కన్నుమూత
ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్ఆర్ తనదైన ముద్రవేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Corona: అమితాబ్ రూ.2కోట్ల విరాళం
6. ఆరు అడుగుల ఎడంతో అధిక రక్షణ
కరోనా వైరస్ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే ముప్పు తగ్గుతుంది? చాలామంది మెదళ్లను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా మరోసారి సమాధానాలిచ్చింది. కొవిడ్ రోగి నుంచి 3-6 అడుగుల లోపు వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Baricitinib తయారీకి సిప్లా ఒప్పందం
కొవిడ్-19 వ్యాధి బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పించే 'బారిసిటినిబ్' ఔషధాన్ని భారత్లో తయారు చేసి విక్రయించేందుకు అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ ఔషధ సంస్థతో దేశీయ ఔషధ తయారీ సంస్థ సిప్లా లిమిటెడ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకొంది. బారిసిటినిబ్ను ఇప్పటి వరకూ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని అదుపు చేయటానికి వినియోగిస్తున్నారు. దీన్ని ఆస్పత్రుల్లో చేరిన కొవిడ్-19 బాధితులకు 'రెమ్డెసివిర్' ఔషధంతో కలిపి ఇవ్వటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) గతేడాది నవంబరులో అత్యవసర అనుమతి ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కాడా.. నిమ్మకాయ.. విటమిన్ మాత్రలు
కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరోనా సోకకుండా జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ‘‘సింఘు సరిహద్దులో ఇప్పటివరకు పెద్దగా కరోనా వైరస్ కేసులు లేవు. రైతులు ‘కాడా’ (మూలికలు, వివిధ మసాలాలతో తయారు చేసిన రసం), నిమ్మకాయ నీళ్లు, విటమిన్ మాత్రలు వాడుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’’ అని సుఖ్వీందర్ అనే రైతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఖాతాను వేరే బ్రాంచ్కి బదిలీ చేయాలా..
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులా? మీ ఖాతాను వేరే బ్రాంచ్కి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళకుండానే, ఆన్లైన్ ద్వారా ఒక శాఖ నుంచి మరొక శాఖకు ఖాతాను బదిలీ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కరోనా నేపథ్యంలో, కాంటాక్ట్ లెస్ డిజిటల్ సేవలకు బ్యాంకు ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే ఈ సేవలను అందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Covid: టీ20 ప్రపంచకప్నకూ తప్పకపోవచ్చు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటం ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేదిక తరలింపునకు లేదా వాయిదాకు కారణం కావొచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ అంటున్నాడు. గతంలోనూ అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. అందులో కొన్ని ఆసక్తికర మ్యాచులకు దారితీయగా కొన్నిబాధాకరమని వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!