Vizag Steel Plant: మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన

Updated : 05 Nov 2023 17:07 IST

అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు వారం గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కౌంటర్‌ దాఖలు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు ఆదినారాయణ, బాలాజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్పందించిన న్యాయస్థానం..దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 29న బిడ్డింగ్‌కు కేంద్రం సిద్ధమవుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బిడ్డింగ్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్రాన్ని కోరగా.. అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిచ్చారు. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 2కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు