Botsa satyanarayana: పాత పెన్షన్‌ విధానం అనేది కష్టసాధ్యమైన వ్యవహారం: బొత్స

ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) అనేది కష్టసాధ్యమైన వ్యవహారం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Published : 30 Sep 2023 15:03 IST

విజయనగరం: పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అనేది కష్టసాధ్యమైన వ్యవహారం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ‘‘గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) విధానాన్ని ఉద్యోగులకు కూడా వివరించాం. సమస్యలు ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి సలహాలను స్వీకరిస్తాం. మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశీలించి అమలు చేస్తాం’’ అని మంత్రి బొత్స అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని