TS news : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు
శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసులిచ్చింది. గౌరవెల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి పిటిషన్పై ఎన్జీటీ చెన్నై బెంచ్లో విచారణ సందర్భంగా...
చెన్నై: శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసులిచ్చింది. గౌరవెల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి పిటిషన్పై ఎన్జీటీ చెన్నై బెంచ్లో విచారణ సందర్భంగా కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో జవాబు చెప్పాలని కేంద్రం 15 రోజుల గడువు విధించింది. అయితే, ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు చేపట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా, విచారణను ఫిబ్రవరి 10 తేదీకి ఎన్జీటీ చెన్నై బెంచ్ వాయిదా వేసింది.
ఏపీలో 3 రిజర్వాయర్లకు అనుమతులు తప్పని సరి
ఏపీలో 3 రిజర్వాయర్లకు కేంద్రం పర్యావరణ అనుమతులను తప్పనిసరి చేసింది. అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లకు అనుమతులు తప్పనిసరి చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎన్జీటీకి నివేదిక దాఖలు చేసింది. ఈ మూడు రిజర్వాయర్లు గాలేరు-నగరి సుజల స్రవంతి పరిధిలోకి రావని తెలిపింది. శ్రీశైలం జలాలను చిత్తూరు జిల్లాకు తరలించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. రూ.6వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది.అయితే కేంద్ర అనుమతులు లేకుండానే ఏపీ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది. దీంతో 3 ప్రాజెక్టులపై బాధితులు జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. పొలాలను ముంచేలా రిజర్వాయర్లు చేపట్టినట్లు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఇవాళ 3 ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తన వైఖరిని ఎన్జీటీలో తేల్చి చెప్పింది. 3 ప్రాజెక్టుల పనులు చేపట్టబోమని ఎన్జీటీలో ఏపీ అండర్ టేకింగ్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు