CM Jagan: ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తి: స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్
ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విజయవాడ: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం జగన్ మాట్లాడారు.
‘‘గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని.. భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని.. టంగూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని.. లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోంది. ఈ జెండాకు రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్ చేస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
Modi: త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం
50 నెలల తమ ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని జగన్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని గొప్ప మార్పు ఇది అని వివరించారు. ‘‘ఆక్వా రైతులను రూ.1.50కే విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మనదే. పాడి రైతులకు పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చాం. మూతబడిన చిత్తూరు డెయిరీతో పాటు సహకార సంఘాలకు జీవం పోశాం. భూవివాదాల ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తున్నాం. 1.54లక్షల ఎస్టీ రైతులకు 3.23లక్షల ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశాం.
2025 జూన్ నాటికి పోలవరం పూర్తి
ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. వంశధార ఫేజ్-2, వంశధార- నాగావళి అనుసంధానం పనులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తిచేస్తాం. వెలుగొండ మొదటి టన్నెల్ పూర్తిచేశాం.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయి’’ అని జగన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఐదు ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
ఎన్నికలు ముగిసే వరకు వాటికి నిధులు విడుదల చేయొద్దు: ఈసీ
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM