teachers transfers: సెప్టెంబరు 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ
తెలంగాణలో సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పారదర్శకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అక్టోబరు 3లోపు టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం లేదా శనివారం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.
కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా ఆగిన ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బదిలీలను కొనసాగించడానికి అనుమతించింది. సమర్థనీయమైన పాలనలో భాగంగా తెలంగాణ విద్యాచట్టంలోని సెక్షన్ 78 (2) ప్రకారం బదిలీలతోపాటు పదోన్నతులిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. బదిలీల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనంగా 10 పాయింట్లు కేటాయించడానికి సమర్థనీయ కారణం కనిపించలేదని పేర్కొంది. దంపతులను మాత్రం కలిసి ఉండనివ్వాలని, వారికి సంబంధించిన నిబంధనలో జోక్యం చేసుకోవడంలేదని హైకోర్టు తెలిపింది. అన్ని బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. నిబంధనల చెల్లుబాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్