నిత్యానందకు నోటీసులు ఇవ్వలేకపోయాం
అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న నిత్యానందకు బెయిల్ రద్దుకు సంబంధించిన నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామనికర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. నిత్యానంద ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నట్లు భావిస్తున్నట్టు హైకోర్టుకు
హైకోర్టుకు వెల్లడించిన కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు : అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న నిత్యానందకు బెయిల్ రద్దుకు సంబంధించిన నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామని కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. నిత్యానంద ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నట్లు హైకోర్టుకు విన్నవించింది.
నిత్యానంద బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు నిత్యానందకు నోటీసులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ బెయిలు రద్దుకు సంబంధించిన నోటీసులను ఆయన ఆశ్రమంలోని కుమారి అర్చనానందకు ఇచ్చామని డిప్యూటీ సూపరింటెండెంట్(సీఐడీ) బాలరాజ్ హైకోర్టుకు తెలిపారు. ఆ సందర్భంలో నిత్యానంద ఆచూకీ తెలియదనే సమాధానం ఆశ్రమ వర్గాల నుంచి వచ్చినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే నోటీసులు అందుకున్న మహిళ మాత్రం, తనకు బలవంతంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ కేసులో ఇవే మొదటి నోటీసులా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికే నిత్యానంద దేశం నుంచి పారిపోయాడని ఫిర్యాదుదారుని తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా నిందితుడు ఈక్వెడార్లో ఆశ్రయం కోసం ప్రయత్నించగా రెండు పాస్పోర్టుల ఉన్న కారణంగా అది విఫలమైనట్టు వార్తలు వచ్చాయని తెలిపాడు. పూర్తి వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ