సినీ నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

సినీనటి శ్రీరెడ్డితో పాటు ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సినీ నృత్య దర్శకుడు ఎస్‌.రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ (49) బంజారాహిల్స్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Published : 29 Feb 2020 06:40 IST

 

జూబ్లీహిల్స్‌: సినీనటి శ్రీరెడ్డితో పాటు ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సినీ నృత్య దర్శకుడు ఎస్‌.రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ (49) బంజారాహిల్స్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో తనను చంపుతామంటూ శ్రీరెడ్డితో పాటు ఆమె అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు అభిమాన సంఘం పేరుతో బెదిరింపులకు దిగుతున్నారంటూ, అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు రోజుల్లో తనను చంపుతామంటూ మరికొందరు బెదిరిస్తున్నారంటూ రాకేష్‌ మాస్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాకేష్‌ మాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. కేసు నమోదు చేస్తామని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని