తెలంగాణలో పది పరీక్షలు వాయిదా

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో మంగళవారం నుంచి జరగాల్సిన పది పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని

Updated : 30 Mar 2020 18:50 IST

హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో మంగళవారం నుంచి జరగాల్సిన పది పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నేటి వరకు పరీక్షలను వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్‌ దృష్ట్యా 31 నుంచి ఏప్రిల్‌ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రేపటి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి..
‘తెలంగాణలో పది పరీక్షలు వాయిదా వేయండి’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని