తగ్గిన రైలు ప్రయాణికులు

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్తున్న ప్రధాన రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్‌ చేసుకుని వచ్చినవారినే అనుమతిస్తుండటం, వారు కూడా చాలామంది ప్రయాణించకపోవడమే దీనికి కారణం. రైల్వే చార్ట్‌ ప్రకారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి

Published : 05 Jun 2020 09:30 IST

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్తున్న ప్రధాన రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్‌ చేసుకుని వచ్చినవారినే అనుమతిస్తుండటం, వారు కూడా చాలామంది ప్రయాణించకపోవడమే దీనికి కారణం. రైల్వే చార్ట్‌ ప్రకారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి గురువారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు 1516 మంది రిజర్వేషన్‌ చేసుకుని ఉండగా 1276 మంది మాత్రమే ఎక్కినట్లు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో ఫలక్‌నుమాలో వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య 1493 ఉండగా 1400 మంది ప్రయాణించారు. నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 620 మంది సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఎక్కాల్సి ఉండగా 421మంది మాత్రమే వచ్చినట్లు గుర్తించారు.

-  రెజిమెంటల్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని