‘జీతంగా.. ప్రభుత్వ సొమ్ము’ విపక్షాలపై దుమ్ము
తన ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు.. ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు.. కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే.. తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం.. జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్.
వైకాపా సోషల్ మీడియా ప్రతినిధులుగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు
వీరిలో ఆర్టీజీఎస్, ఏపీఎండీసీ, ఈ-ప్రగతి.. తదితర సంస్థల వారే అధికం
ప్రజాధనం తీసుకుంటూ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ..
ఈనాడు, అమరావతి
తన ఐదేళ్ల పాలనలో..
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు..
ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు..
కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే..
తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం..
జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్.
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పొరుగు సేవలు, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారు ఎవరైనా కూడా... రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష ప్రచారం చేయకూడదు. ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా, పార్టీలను తిడుతూ పోస్టింగ్లు వంటివి పెట్టకూడదు. ఈ నిబంధన అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారు. కానీ, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో... ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది వైకాపా సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులుగా, జిల్లా, రీజినల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు చూస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పోస్టింగ్లు పెడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులతోనూ కలిసి ప్రచారం చేస్తున్నారు. వీరు తమ అసలు విధులేవీ సక్రమంగా నిర్వహించరు. డ్యూటీలకూ హాజరుకారు. అయినాసరే ఠంచన్గా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు మాత్రం అందుతాయి. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడిస్తూ వీరికి జీతాలిస్తూ జీ... హుజూర్! అంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల వైకాపా సామాజిక మాధ్యమ కోఆర్డినేటర్లూ ఏదో ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సలహాదారుడి కుమారుడి నేతృత్వం
వైకాపా సామాజిక మాధ్యమ విభాగానికి ప్రభుత్వంలో ఓ కీలక సలహాదారు కుమారుడే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధీనంలోనే వీరంతా పనిచేస్తుంటారు. ఆయనే వైకాపా మద్దతుదారులైన వీరికి ప్రభుత్వ జీతాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఏప్రిల్లో విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్ద వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఆ సలహాదారు కొడుకే సారథ్యం వహించాడు. అక్కడకు వందల సంఖ్యలో వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగుసేవల విభాగంలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం.
వారి జోలికి వెళ్లడానికి భయం
వైకాపా కార్యకర్తలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), డిజిటల్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, ఈ-ప్రగతి... ఇలా అనేక విభాగాల్లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులుగా చూపిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉండే ఆర్టీజీఎస్లో నిత్యం విధులకు హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. కానీ, రికార్డుల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. వారంతా బయట వైకాపాకి పనిచేస్తుంటారు. ఏళ్ల తరబడి అసలు కార్యాలయాలకే రారు. సీఎంవోలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య... ఆర్టీజీఎస్లో ఉద్యోగిగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఆమె ఎప్పుడూ విధులకు హాజరుకాలేదు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఆర్టీజీఎస్లో జీతం తీసుకుంటూ, వేరే ఇతర పనులు చేసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఏపీఎండీసీలోనూ ఇదే జరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి సిఫార్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వాళ్లకు పెద్ద సంఖ్యలో ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో చాలామంది చిత్తూరు జిల్లాలో వైకాపాకి పని చేస్తుంటారు. కొందరు సీఎంవోలో లాబీయింగులు చేస్తుంటారు.
విచారణ జరిగితే జైలుకే...
ప్రభుత్వ జీతాలను తీసుకుంటూ.. వైకాపా సామాజిక మాధ్యమ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై విచారణ జరిపితే... వారంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కొందరు తమ సామాజిక మాధ్యమ పోస్టుల్లో దూషణలతో రెచ్చిపోతున్నా సరే.. ఆయా శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం మారాక దీనిపై విచారణ జరిగితే.. ఇలా సహకరించిన అధికారులు కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటూ, ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతుంటే.. ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.
కూటమిపై అక్కసు... రోజుకు 50 పోస్ట్లు
ఈయన పేరు వర్రా రవీంద్రారెడ్డి. పులివెందుల సమీపంలోని కొండ్రెడ్డిపల్లె స్వగ్రామం. 2019 వరకు భారతీ సిమెంట్స్ పరిశ్రమలో అతి తక్కువ జీతానికి పనిచేసేవాడు. గతంలో ఓ ఛానల్ న్యూస్ రీడర్పై వివాదాస్పద పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైకాపా పెద్దల దృష్టిలో పడ్డాడు. జగన్ ప్రభుత్వం వచ్చాక అతనికి ఆర్టీజీఎస్లో ఉద్యోగం ఇచ్చారు. పేరుకే ఉద్యోగం... పూర్తిగా వై.ఎస్.ఆర్. జిల్లాలోనే ఉంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపాకి అనుకూలంగా పెద్దఎత్తున పోస్టులు పెడుతుంటాడు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, ఆ పార్టీల మహిళా నేతలపై అసభ్య పదజాలంతో, ఇష్టానుసారం బూతులతో రోజుకు 50-60 వరకు పోస్టులు పెట్టి ఆనందం పొందుతుంటాడు. వాటిలో మార్ఫింగ్ ఫొటోలూ ఉంటాయి. అందుకు అతనికి నెలకు రూ.70 వేల చొప్పున ఆర్టీజీఎస్ నుంచి జీతం ఇప్పిస్తున్నారు.
ఆర్టీజీఎస్లో డైరెక్టర్... కడప వైకాపాలో డైరెక్షన్
వైకాపా అధినేత జగన్ ఫొటోతో ‘మేము సిద్ధం... మా బూత్ సిద్ధం’ అనే పోస్టర్లో ఉన్న ఈయన పేరు పోతుల శివారెడ్డి. కడప నగర శివారు రూకవారిపల్లె స్వగ్రామం. ఆయనో వైకాపా నాయకుడని అనుకుంటే పొరపడినట్లే. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆర్టీజీఎస్లో డైరెక్టర్ పోస్టులో ఉన్నాడు. ఆయన నెల జీతం లక్ష రూపాయలపైనే. చాలాకాలంగా వైకాపాకి ప్రచారం చేస్తూ.. ఆ జిల్లాలో వైకాపా సామాజిక మాధ్యమ బాధ్యతలను చూస్తున్నాడు. ఆయన ఫేస్బుక్ ఖాతాలో వైకాపాకి అనుకూలంగా... తెదేపా, జనసేన, భాజపాలకు వ్యతిరేకమైన పోస్టులే ఉంటాయి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా... ఎలాంటి భయం లేకుండా వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నాడు.
విధులు మరచి... జగనన్న సేవలో తరించి!
ఈయన పేరు పులివెందుల వివేక్రెడ్డి. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం వై.ఎస్.ఆర్. జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఇతన్ని ఆర్టీజీఎస్ ఉద్యోగిగా చూపించి ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇస్తున్నారు. ఇతని ఫేస్బుక్ ఖాతాలోనూ వైకాపా అనుకూల పోస్టులే. ఇటీవల పులివెందుల నియోజకవర్గ పరిధిలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం చేస్తే దర్జాగా పాల్గొన్నాడు. తరచూ వైకాపాకి అనుకూలంగా ఫేస్బుక్లో లైవ్ చర్చలు నిర్వహిస్తుంటాడు.
‘కోడ్’ ఉన్నా... ఆగని కూతలు!
ఇతని పేరు నిరంజన్రెడ్డి. వై.ఎస్.ఆర్. జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేలంపల్లి స్వస్థలం. ఈయన కూడా ఆర్టీజీఎస్ ఉద్యోగే. ఆ విషయాన్ని మరచి సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపాకి దర్జాగా ప్రచారం చేస్తుంటాడు. ఇతడి ఫేస్బుక్ ఖాతా నిండా జగన్ అనుకూల పోస్టులే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే రోజుకు పదుల సంఖ్యలో పోస్టులు పెడుతున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు