వెంకన్న కొండనూ వదల్లేదు!
పెదకూరపాడు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో
అమరావతి, న్యూస్టుడే
కొండను తవ్వేశారిలా..
పెదకూరపాడు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో అనుచరులు నిన్నటి వరకు కృష్ణమ్మ నదీ గర్భంలో తవ్వకాలు జరిపి ఇసుక రీచ్లకు బాటలు వేయగా.. ఇప్పుడు కలియుగ వైకుంఠవాసుడు స్వయంభూగా కొలువై భక్తులచే పూజలందుకుంటున్న వైకుంఠపురంలోని వెంకన్న కొండనూ కొల్లగొడుతున్నారు. వైకుంఠపురం ఇసుక రీచ్లో బాటలు వేసేందుకు మట్టి తరలిస్తున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కొండను తవ్వేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కొండ మట్టితోనే బాటలు, వంతెనలు
ఉత్తర వాహిణిగా పేరుగాంచిన కృష్ణానది చెంతన కొండకు పశ్చిమ దిక్కులో సుమారు 100 అడుగుల లోతు, 200 అడుగుల మేర వెడల్పులో రాత్రివేళల్లో పొక్లెయిన్తో తవ్వి వందల సంఖ్యలో లారీల్లో మట్టిని ఇసుక రీచ్కు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాల సందర్భంగా కొండ నుంచి వచ్చిన పెద్ద బండలను కృష్ణానదిలోకి నెట్టి వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా కొండను తవ్వి, నదిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర బాటలు, మట్టి వంతెన నిర్మించడానికి మట్టిని ఉపయోగిస్తున్నారు. ఈ బాటలు, వంతెనల మీదుగా భారీ వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు.
కొండ నుంచి తవ్విన మట్టితో కృష్ణానదిపై నిర్మించిన వంతెనపై వెళుతున్న ఇసుక లారీలు
గ్రామస్థుల భయాందోళన
దేవుడి కొండను తవ్వడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలను అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయిస్తారన్న భయంతో నోరు మెదపలేక పోతున్నామని వారు పేర్కొంటున్నారు. కృష్ణానదికి వచ్చే వరదల నుంచి కొన్ని వందల గ్రామాలను ఈ కొండ కాపాడుతుందని, దాన్ని కరిగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఓ రాజకుమారిని ‘న్యూస్టుడే’ వివరణ అడగ్గా ఏ కొండకు మట్టి తవ్వాలన్నా రెవెన్యూ అనుమతి తప్పనిసరి అన్నారు. తహసీల్దార్ అనుమతి ఇచ్చారేమో తెలుసుకుంటామన్నారు. అనుమతి లేకపోతే తవ్వకాలను అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. దీనిపై తహసీల్దారు విజయశ్రీని అడగ్గా మట్టి తవ్వకానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు