Andhra News: ‘అసని’ ఎఫెక్ట్‌: ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ పరీక్షలపై పడింది. తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన

Updated : 21 Nov 2022 16:38 IST

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ పరీక్షలపై పడింది. తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఇంటర్‌ పరీక్షను వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్‌ పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. బోర్డు నిర్ణయం మేరకు బుధవారం జరగాల్సిన ఇంటర్‌ మొదటి సంవత్సరం గణితం పేపర్‌-1ఏ, వృక్ష శాస్త్రం, పౌరశాస్త్రం వాయిదా పడ్డాయి. బుధవారం జరగాల్సిన పరీక్ష మినహా బోర్డు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మిగతా పరీక్షలు జరగనున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని