KTR: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి: కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్టైల్ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్టైల్ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్టైల్ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమిపూజ అనంతనం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘వరంగల్కు పూర్వ వైభవం తీసుకొస్తాం. పట్టుపట్టి మరీ వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న నేతన్నలు ఉన్నారు కాబట్టే వరంగల్కు మంచి పేరు వచ్చింది. వరంగల్ జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతోంది. గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టింది. గణేశా కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయి. యంగ్ వన్ కంపెనీలో మొత్తంగా 11 పరిశ్రమలు వస్తాయి. తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి.
మేడిన్ వరంగల్ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయి. యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. టెక్స్టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చింది. వరంగల్ జిల్లాలో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయి. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే కాకతీయ టెక్స్టైల్ పార్కు వచ్చింది. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారు. నియోజకవర్గాలు మార్చుకొని మరీ వేరేచోటుకు వెళ్లిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి