Central Tribal University: విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన

గిరిపుత్రుల జీవితాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం విద్యాకాంతులు నింపుతుందని సీఎం జగన్‌ అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. 

Updated : 25 Aug 2023 14:22 IST

విజయనగరం: గిరిపుత్రుల జీవితాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం విద్యాకాంతులు నింపుతుందని సీఎం జగన్‌ అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. 

అనంతరం దత్తిరాజేరు మండలం మరడాంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి వర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడతారని జగన్‌ అన్నారు. మరో మూడేళ్లలో ఈ విశ్వవిద్యాలయాన్ని జాతికి అంకితం చేస్తామని సీఎం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని