Komatireddy: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి

అన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లు పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 

Updated : 21 Jan 2024 17:12 IST

 

భువనగిరి: అన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లు పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం భువనగిరి కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చించిన ఆయన.. రూ.100 కోట్లతో మోడల్‌ క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ దస్త్రంపై ఇప్పటికే మంత్రి పొంగులేటి సంతకం చేశారని వెల్లడించారు. త్వరలో భువనగిరి ఖిల్లా రోప్‌ వే నిర్మాణం కానుందని తెలిపారు. యాదాద్రిలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, కొండపైకి ఆటోల అనుమతి విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు. గృహాలకు ఉచిత విద్యుత్‌ పథకంపై కేటీఆర్‌ ఆలోచించి మాట్లాడాలని సూచించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలంగాణకు మణిహారమని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని