Komatireddy: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి
అన్ని విద్యుత్ సబ్స్టేషన్లలో లాగ్బుక్లు పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
భువనగిరి: అన్ని విద్యుత్ సబ్స్టేషన్లలో లాగ్బుక్లు పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆదివారం భువనగిరి కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చించిన ఆయన.. రూ.100 కోట్లతో మోడల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ దస్త్రంపై ఇప్పటికే మంత్రి పొంగులేటి సంతకం చేశారని వెల్లడించారు. త్వరలో భువనగిరి ఖిల్లా రోప్ వే నిర్మాణం కానుందని తెలిపారు. యాదాద్రిలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, కొండపైకి ఆటోల అనుమతి విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు. గృహాలకు ఉచిత విద్యుత్ పథకంపై కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని సూచించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణకు మణిహారమని మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వీడియోలు చూసి.. చోరీ చేసి
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
తరుగు పేరిట దోపిడీ
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.