Corona: నిబంధనలు పాటిస్తేనే మూడో దశ కట్టడి..
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. దీంతో మార్కెట్లు, వాణిజ్య సముదాయాలలో సందడి మొదలైంది.
దిల్లీ: దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. దీంతో మార్కెట్లు, వాణిజ్య సముదాయాలలో సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోతే రాబోయే రోజుల్లో వైరస్ ఉత్పరివర్తనాల వ్యాప్తిని అడ్డుకోలేమని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ నీరజ్ నిశ్చల్ చెప్పారు. ప్రస్తుత సంక్షోభం వైరస్ సంబంధమైన, మానవ సంబంధమైన అనే రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉందని అన్నారు. వైరస్లో ఉత్పతరివర్తనాల అంశం ఎవరి చేతుల్లో లేదని, సరైన నిబంధనలు పాటించడం ద్వారానే కరోనా కేసులు తగ్గించగలమని డాక్టర్ నీరజ్ తెలిపారు.
‘‘ప్రస్తుతం ఉన్న వైరస్ ఉత్పరివర్తనాలు త్వరగా వ్యాప్తిచెందగలవు. వాటిని నియంత్రిచడం సాధ్యంకాదు. అయితే సరైన నిబంధనలు పాటిస్తే వాటిని మన శరీరాల్లో ఉత్పరివర్తనం చెందకుండా అడ్డుకోవచ్చు. మన ప్రవర్తన ద్వారానే దానిని నియంత్రిచగలం. గత 15-16 నెలలుగా కొవిడ్-19 ప్రవర్తన నియమావళి గురించి మనం మాట్లాడుతున్నాం. అందరం కలిసికట్టుగా మాత్రమే ఈ మహమ్మారి అడ్డుకోగలం. రెండో దశలో కూడా ఇదే జరిగింది’’ అని డాక్టర్ నీరజ్ తెలిపారు.
లాక్డౌన్ విధించి, ప్రతిఒక్కరు కొవిడ్-19 నిబంధనలు పాటించేలా చేయడం ద్వారానే రెండో దశ వ్యాప్తిని అడ్డుకున్నట్లు వెల్లడించారు. అలానే టీకా ప్రక్రియ కూడా వైరస్ వ్యాప్తి, తీవ్రత నుంచి రక్షణ కల్పించగలదని అన్నారు. ఆదివారం నాటికి దేశంలో 58 వేల కరోనా కేసుల నమోదయ్యాయి. 81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. శనివారంనాడు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే వైరస్ మూడో దశ ప్రభావం ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుందని అన్నారు. ఇందుకోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
ప్రయాణికుల రద్దీతో 22 రైళ్లకు అదనపు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి చెందిన మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?