ఓంప్రతాప్ మృతిపై ప్రత్యేక విచారణ
మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓంప్రతాప్ (30) మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ..
చిత్తూరు: మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓంప్రతాప్ (30) మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ప్రత్యేక అధికారి, సోమల తహశీల్దార్ శ్యాం సుందర్రెడ్డి, ఓంప్రతాప్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు ఉదయం బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రతాప్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఈ నెల 24న ఖననం చేసిన ప్రాంతంలోనే వైద్యులు శవపరీక్ష పూర్తి చేశారు.
ఏం జరిగిందంటే?
సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదెమ్మల పెద్దకుమారుడు ఓంప్రతాప్ మదనపల్లెలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల బసినికొండ సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి మద్యం కొన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తిని వీడియో తీయమన్నాడు. అందులో రూ.140లుగా ఉన్న బీరు బాటిల్ను రూ.240కు పెంచారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈనెల 24న స్వగ్రామంలో పొలం పనులకు వచ్చి మృతి చెందాడు. మరో వైపు ఓంప్రతాంప్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు బయల్దేరని చిత్తూరు జిల్లా తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్