Warangal: ప్రీతి ఆత్మహత్య కేసు.. పారదర్శకంగానే దర్యాప్తు: తండ్రి నరేందర్
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కలిసి కోరానని చెప్పారు.
వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసుపై పూర్తి నమ్మకం కలిగిందని ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకున్నానన్నారు. పోస్టుమార్టం నివేదికపై వివరాలను సీపీని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు నరేందర్ తెలిపారు.
‘‘కేసుపై ఉన్న సందేహలను సీపీని అడిగి తెలుసుకున్నాను. ప్రీతిది ఆత్మహత్యే అని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపించారు. త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు’’ అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు వెల్లడించారు.
ప్రీతి మృతి కేసులో కీలకమైన పోస్టుమార్టం నివేదిక వివరాలను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు. గతంలో ప్రీతి రక్తనమూనాల్లో కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మృతిపై ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. 50 రోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తాజా నివేదికను రుజువుగా చూపి సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి బలవన్మరణానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు న్యాయస్థానంలో త్వరలో అభియోగ పత్రం (ఛార్జ్షీట్) దాఖలు చేయనున్నారు. ఇటీవల నిందితుడు సైఫ్కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు