Idupulapaya: ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో మంచం కింద కొండచిలువ

వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో కొండచిలువ కలకలం సృష్టించింది.

Updated : 16 Nov 2023 20:52 IST

వేంపల్లె: వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో కొండచిలువ కలకలం సృష్టించింది. బాయ్స్‌ హాస్టల్‌-2లో ఓ మంచం కింద కొండ చిలువ కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లగా.. అటవీ శాఖ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని కొండచిలువను గోనె సంచిలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని