తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్‌

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 19 Mar 2024 15:45 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్‌ రాజీనామాతో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌ వేదికగా కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని