Andhra Pradesh : మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు సంస్థకు సుప్రీంలో ఊరట

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు..

Updated : 04 Feb 2022 22:30 IST

దిల్లీ: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సదరన్‌ రాక్స్‌ అండ్‌ మినరల్స్‌ సంస్థ సీనరేజీ డిపాజిట్‌ చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. సంస్థకు పదేపదే నోటీసులు జారీపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని