ఈ ఆలయాల సంపద అంతా ఇంతా కాదు!
భారతదేశంలో వేలసంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించేందుకు నిత్యం ఆ ఆలయాలకు వెళ్తుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి.. తమకు తోచిన విధంగా కానుకలు చెల్లిస్తారు. ఇలా కానుకల రూపంలో వచ్చిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు దేవాలయానికి ఆదాయంగా
భారతదేశంలో వేలసంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించేందుకు నిత్యం ఆ ఆలయాలకు వెళ్తుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి.. తమకు తోచిన విధంగా కానుకలు చెల్లిస్తారు. ఇలా కానుకల రూపంలో వచ్చిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు దేవాలయానికి ఆదాయంగా మారుతుంది. ఈ క్రమంలో కొన్ని దేవాలయాల సంపన్న దేవాలయాలుగా అవతరించాయి. మరి దేవాలయాలేవి? వాటి సంపద ఎంతో తెలుసుకుందామా..?
అనంత పద్మనాభస్వామి దేవాలయం - తిరువనంతపురం
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరుగాంచింది. ఒకప్పుడు ఈ ఆలయం తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులు ఏలుబడిలో వుండేది. కొంతకాలం కిందట ఆ ఆలయంలో ఉన్న నేలమాళిగల్లో నిధి ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని గదులను తెరవగా.. రూ. వేలకోట్లు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. మరొక గదికి నాగబంధనం ఉండటంతో పండితులు తెరవకూడదన్నారు. అందులో అనంత సంపద ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సంపద విలువ కనీసం రూ.1.63లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి
వేంకటేశ్వరస్వామి ఆలయం - తిరుమల
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల శ్రీనివాసుని ఆలయం దేశంలోనే ఎక్కువ మంది భక్తుల తాకిడి ఉన్న దేవాలయం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం నిత్యం సగటున 70వేల మంది వస్తుంటారు. కలియుగ దైవంగా కొలిచే శ్రీవారికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా భక్తుల సంఖ్య, ఆదాయం తగ్గింది కానీ.. సాధారణంగా ఏటా రూ.650కోట్లు భక్తుల కానుకల రూపంలో వస్తాయి. ఈ దేవాలయ నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) చూసుకుంటుంది. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి
వైష్ణో దేవి - జమ్ముకశ్మీర్
శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన దేవాలయం వైష్ణోదేవి ఆలయం. జమ్ముకశ్మీర్లోని కత్రా ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి దేశవిదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఏటా వైష్ణోదేవీ ఆలయానికి రూ. 500కోట్లు భక్తుల కానుకల రూపంలో వస్తాయట.
సాయి బాబా దేవాలయం - షిర్డీ
అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా ఆలయం ఒకటి. హిందువులతోపాటు పలు మతాలకు చెందిన వారు కూడా సాయి బాబాను దర్శించుకుంటుంటారు. షిర్డీ సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే ఈ దేవాలయానికి ఏటా రూ.450కోట్లు ఆదాయం వస్తోంది. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి
సిద్ధి వినాయక ఆలయం - ముంబయి
ముంబయిలో అనేక దేవాలయాలు ఉన్నా.. ఎస్కే బోలె మార్గ్లో ఉన్న సిద్ధి వినాయక ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయంలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులందరూ వెళ్తుంటారు. వినాయకుడికి ప్రముఖులు భారీగానే కానుకలు సమర్పించుకుంటుంటారు. అందుకే అతి సాధారణంగా కనిపించే ఈ ఆలయానికి ఏటా రూ.125కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఆలయంపై ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి
ఇవేకాకుండా తమిళనాడులోని మీనాక్షి అమ్మన్, ఒడిశాలోని పూరీ జగన్నాథ్, గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాలకు కూడా రూ.కోట్లలో ఆదాయం ఉంటుందట.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
మిగ్జాం తుపాను కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. -
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
TS News: ఇద్దరు ఓఎస్డీలు సహా పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామా
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్రావు రాజీనామా చేశారు. -
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
మిగ్జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. -
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. -
Cyclone Michaung: ‘మిగ్జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. -
Telangana: టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు రాజీనామా
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
Swarnamukhi River: తుపాను ఎఫెక్ట్.. ‘స్వర్ణముఖి’లోకి భారీగా వరద
మిగ్జాం (Cyclone Michaung) తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. -
kazipet-vijayawada : కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
మిగ్జాం తుపాను నేపథ్యంలో అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు. -
నోటా.. మాట వినలేదు..!
పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)కు ఓటు వేయొచ్చు. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటా మాట చాలా మంది వినలేదు. -
కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి
కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్ రాందాస్నాయక్ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!