MLAs Bribery case: నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు?: శ్రీనివాస్ను ప్రశ్నించిన సిట్
ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నందకుమార్, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని న్యాయవాది శ్రీనివాస్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో న్యాయవాది శ్రీనివాస్ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అతనికి నోటీసులు జారీ చేసింది. నందకుమార్, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్ వద్ద శ్రీనివాస్ రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపిన సిట్ అధికారులు.. ఆ అప్పుకు సంబంధించి నెలకు రూ.1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డీ చెల్లించడానికి వాడిన గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్ చేస్తారని శ్రీనివాస్ చెప్పగా.. నందూ, సింహయాజితో ఎక్కడెక్కడ ప్రయాణించారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్ బుక్ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలన్నారు. రేపు విచారణకు హాజరుకావాలని.. వచ్చేటప్పుడు పలు వివరాలు తీసుకురావాలని సిట్ అధికారులు ఆదేశించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 21, 22న న్యాయవాది శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈనెల 21న తన శాంసంగ్ ఫోన్ను సిట్ అధికారులకు అప్పగించారు. జులై వరకు వాడిన మరో ఫోన్ అప్పగించాలని శ్రీనివాస్కు స్పష్టం చేశారు. పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్త ఫోన్ కొన్నట్టు సిట్ అధికారులకు తెలిపారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు పేర్కొన్నారు. సిట్కు అప్పగించిన మొబైల్ ఫోన్లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని తెలిపారు. శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్ పోర్టు ఇవ్వాలని సిట్ అధికారులు ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్