VandeBharat: తిరుపతి -సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రెల్వే స్టేషన్లో నిలిపివేశారు.
మనుబోలు: తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రెల్వే స్టేషన్లో నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందేభారత్ రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వాకీటాకీ ద్వారా లోకో పైలట్కు సమాచారం ఇచ్చారు. రైలును మనుబోలు స్టేషన్లో నిలిపి వేయడంతో అప్పటికే భయాందోళనలో ఉన్న ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దిగేశారు.
మూడో బోగీలోని బాత్రూమ్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాత్రూమ్లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామగ్రికి అంటుకోవడం వల్లే పొగ వ్యాపించిందని నిర్ధరించారు. ఈ ఘటనకు బాధ్యుడైన టికెట్ లేని ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి రైలును పంపివేశారు. దీంతో అరగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM