అక్కడ సర్పాలే దైవాలు
కౌతారం మండల పరిధిలోని దొమ్మలదిన్నె, అగసలదిన్నె గ్రామాల్లో పాములను దైవంగా భావిస్తారు. అవి కనిపిస్తే పూజలు చేస్తారు. వారి ఇళ్లల్లోకి దూరినా వాటిని పట్టుకొని అడవిలో వదిలేస్తారు....
పాము కాటువేస్తే తమ తప్పేనని భావన
ఇంటర్నెట్ డెస్క్: పామును చూస్తే చాలా మంది జడుసుకుంటారు. దాన్ని చంపకపోతే కాటేస్తుందేమోనని భయపడిపోతుంటారు. కానీ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. కౌతాళం మండల పరిధిలోని దొమ్మలదిన్నె, అగసలదిన్నె గ్రామాల్లో పాములను దైవంగా భావిస్తారు. అవి కనిపిస్తే పూజలు చేస్తారు. వారి ఇళ్లల్లోకి దూరినా వాటిని పట్టుకొని అడవిలో వదిలేస్తారు. వర్షాకాలంలో పదుల సంఖ్యలో పాములొచ్చి ఇబ్బంది పెట్టినా కనీసం వాటిమీద కోపం చూపించరు. పొరపాటున అవి కరిచినా అది తమ పాపమేనని అనుకుంటారు. ఇప్పటివరకు తమ ఊళ్లలో ఒక్క పామును కూడా చంపలేదని ప్రజలు గర్వంగా చెబుతారు.
సర్పాలను దేవుని స్వరూపాలుగా భావించి తమ ఇళ్లల్లోకి దేవుడే వచ్చాడని సంబరపడిపోతారు ఇరు గ్రామాల ప్రజలు. కర్రతో తోసినా వెళ్లకపోతే కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తారు. కళ్లు మూసి దండం పెట్టుకుంటే వాటంతటవే వెళ్లిపోతాయని గ్రామస్థులు నమ్ముతారు. ఈ రెండు గ్రామాల్లో నాగలింగేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇక్కడి దేవుడిని కరిపామన్న అనే పేరుతో కొలుస్తారు. ఏడాదికి ఒకసారైనా రథోత్సవం జరుపుతారు. ఈ రెండు గ్రామాలకు మధ్య భూగర్భంలోకి దారి ఉందని, అక్కడ పాములు సంచరిస్తాయని ఇరు గ్రామాల ప్రజలు నమ్ముతారు. పాము కాటువేస్తే ఆ వ్యక్తే తప్పుచేసినట్లు భావిస్తారు. ఇప్పటివరకు పాము కాటువేసిన సందర్భాలు తక్కువేనని ప్రజలు పేర్కొన్నారు.
గతంలో ఏదో కనిపించని విష పురుగు కరిచి ప్రజలు మరణిస్తూ ఉంటే ఈ రెండు గ్రామాల్లో పామును పూజిస్తే పరిష్కారం దొరుకుతుందని ఓ ముని చెప్పాడనే కథ ప్రచారంలో ఉంది. అందుకే తమ పూర్వీకుల కాలం నుంచే పాములను పూజించే ఆచారం ఉందని స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి...
వధువు వద్దంది.. పెళ్లికొచ్చిన అమ్మాయే పెళ్లి కూతురైంది
ఫేమ్ను క్యాష్ చేసుకుంటున్నారుగా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.