AP News: మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తా: అఠావలే

విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలే ఇవాళ ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించారు.

Updated : 18 Oct 2021 13:17 IST

విశాఖ: విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలే ఇవాళ ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తా అని చెప్పారు. ఆంధ్రా మత్య్సకారులు ఒడిశాలో ఇబ్బంది పడుతున్నారన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని.. తను ఎన్డీఏలో చేరాలని అఠావలే నిన్న కోరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని