Telangana government: పదోన్నతుల అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు
పదోన్నతుల అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకు
హైదరాబాద్: పదోన్నతుల అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకు కుదించింది. పదోన్నతి కోసం ఇప్పటివరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. 2020-21 ప్యానల్ సంవత్సరానికి కనీస సర్వీసును రెండేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తగ్గింపు మిగతా సంవత్సరాలకు కూడా వర్తించాలని, లేదంటే చాలా మంది ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ప్యానెల్ సంవత్సరాలకు సంబంధం లేకుండా కనీస సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీపీసీ నిర్వహించే సమయానికి రెండేళ్ల కనీస సర్వీసు ఉంటే పదోన్నతులకు అర్హులన్న ప్రభుత్వం.. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!