AP High Court: గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్‌ ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌

గుంటూరు జడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే

Published : 27 Sep 2021 13:05 IST

అమరావతి: గుంటూరు జడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రిస్టినా తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని