10th class result 2022: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాలను సోమవారానికి వాయిదా
అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల (10th class result 2022) వాయిదా పడింది. ఫలితాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు.
ముందు ప్రకటించిన విధంగా ఈ ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఈ క్రమంలో మీడియా సమావేశానికి రావాల్సిన అధికారులు ఆలస్యమైనా రాకపోవడంతో ఫలితాల వెల్లడిపై సందిగ్ధం ఏర్పడింది. కాసేపటికే ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సమన్వయ లోపమే కారణమా?
పదో తరగతి ఫలితాల విడుదల వాయిదాలో మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స అందుబాటులో లేకపోవడంతో ఫలితాలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మంత్రివర్గ కూర్పు తర్వాత ప్రకటిస్తున్న తొలి ఫలితాలు ఇలా వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
నోటా.. వచ్చిందిలా
-
రైలు తలుపు.. మృత్యు పిలుపు
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు