Viral Video: చంకలో చంటి బిడ్డతో చకచక వార్తలు చదివేసిన యాంకర్..!
ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అటు ఉద్యోగంలో రాణిస్తూ.. తమ బాధ్యతల్ని సమన్వయం చేస్తుటారు మహిళలు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అటు ఉద్యోగంలో రాణిస్తూ.. తమ బాధ్యతల్ని సమన్వయం చేసుకొంటారు మహిళలు. అయితే, కొత్తగా ఇంట్లోకి బుజ్జాయిని ఆహ్వానించిన తల్లులు వారిని వదిలి విధులకు వెళ్లడం కాస్త కష్టంగానే ఉంటుంది. అమెరికాకు చెందిన ఓ వార్త సంస్థలో వాతావరణ వివరాలు వెల్లడించే న్యూస్ యాంకర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయినా, ఏ మాత్రం వెనకడువేయకుండా పిల్లను చంకపెట్టుకొని, పని చక్కబెట్టిన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
అమెరికాకు చెందిన రెబెకా షుడ్ ఓ వార్త సంస్థలో వాతావరణ వివరాలు రిపోర్టు చేస్తుంటారు. మెటర్నిటీ సెలవుల అనంతరం కరోనా కారణంగా ఆమె ఇంటినుంచే పనిచేస్తున్నారు. సరిగా తాను వెదర్ గురించి రిపోర్టు చేసే సమయానికి ఆమె మూడు నెలల చిన్నారి నిద్ర నుంచి మేల్కొంది. ‘నేను నా పని మొదలుపెడదామనుకునే సమయానికి, మా పాప నిద్రలేచింది. దీంతో తనను తీసుకొని వార్తలు చదివే ప్లేస్కు వెళ్లాను. అయ్యో మీ పాప కనిపిస్తుందా..? ఇబ్బంది కాదా..? అని మా హెడ్ అడిగారు. అయితే, తను అప్పటికే చాలా సేపు నిద్రపోయింది కాబట్టి, ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను హామీ ఇచ్చి, నా పని కొనసాగించాను’ అంటూ తన అనుభవాన్ని వెల్లడించారు.
కాగా, ఈ వెదర్ రిపోర్టు నెట్టింట్లో వైరల్గా మారింది. రెబెకా తన బాధ్యతల్ని సమన్వయం చేసిన తీరు ప్రతిఒక్కరిని మెప్పించింది. వర్కింగ్ విమెన్కు మీరు నిజమైన అర్థమంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. తన పని ఇంతమందిని మెప్పించడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ‘ఇది నాకు దక్కిన గౌరవం. నేనింకా షాక్లో ఉన్నాను’ అంటూ వినయంగా స్పందించారు. తమ లక్ష్యాలవైపు ప్రయాణించే మహిళలకు ఈ సంఘటన ప్రేరణగా నిలుస్తుందని ఆమె ఆశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్