Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
1.కరీంనగర్లో కరోనా కలకలం.. 46 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు కళాశాలలోని 46 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయింది. కొవిడ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. కళాశాలలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం జరిగింది.
2.వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు: అంబటి
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంపై కేంద్ర జల వనరులశాఖ మంత్రి షెకావత్ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వాయిస్ను పార్లమెంట్లో వినిపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్ తెలుసుకోవాలని సూచించారు.
3.దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. రాజస్థాన్లో కొత్తగా మరో 9
దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్లో 9 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
4.పాక్ కొరివితో తలగోక్కున్న వేళ ..!
భారత్ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్ దేశాల పై ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడిచేసి గెలవడాన్ని చూసిన పాక్ తాను కూడా అలానే భారత్ను ఓడించాలని కలలుగన్నది. అందుకోసం ప్రయత్నించే క్రమంలో కొరివితో తలగోక్కుంది.
5.ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్లో వచ్చేది మేమే: అమిత్షా
రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా బదులిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కూల్చబోమని, కానీ 2023లో వచ్చేది మాత్రం తామేనని చెప్పారు. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
6.భారత్ విడిచివెళ్లేందుకు నటి ప్రయత్నం.. విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు!
మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయం చేరుకున్న ఆమెను అక్కడి అధికారులు అడ్డుకున్నారు.మనీలాండరింగ్ కేసులో విచారణ జరుపుతోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలోనే జాక్వెలిన్ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం.
7.తాలిబన్.. ఆ హత్యలు ఆపండి..!
అఫ్గానిస్థాన్ పౌర ప్రభుత్వం హయాంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి. ‘‘వేటాడి మరీ హత్యలు చేయడాలు, వ్యక్తుల అదృశ్యాలపై అఫ్గానిస్థాన్ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
8.మెట్రో బ్రాండ్స్, ఇన్స్పిరా ఐపీఓ.. ఎప్పుడంటే?
ప్రముఖ ఫుట్వేర్ రిటైలర్ ‘మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్’ ఐపీఓ డిసెంబరు 10న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 14న ముగియనుంది. రూ.295 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు 10 శాతం వాటాను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కంపెనీలో వీరి వాటా 75 శాతానికి రానుంది.
9.ఇంకా ఐదే మిగిలాయి.. లంచ్ లోపే ముగించేస్తారా?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్లో హెన్రీ నికోల్స్ (36*), రచిన్ రవీంద్ర (2*) ఉన్నారు. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లేథమ్ (6), రాస్ టేలర్ (6), టామ్ బ్లండెల్ (0) మరోసారి విఫలమయ్యారు.
10.ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్ ఫొటోస్ కొత్త ఫీచర్
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వాడే ప్రతి యూజర్ కోరుకునేది డేటా ప్రైవసీ. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వంటి వాటితోపాటు వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫొటోస్ (Google Photos) యూజర్స్కు మరో కొత్త ప్రైవసీ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?