తిరుమల వచ్చే భక్తులపై తితిదే ఆంక్షలు 

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు తిరుమల వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆంక్షలు విధించింది...

Published : 30 Mar 2021 01:19 IST

తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు తిరుమల వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. నడకదారి భక్తులకు ముందురోజు ఉదయం 9గంటల నుంచి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, వాహనాల్లో వచ్చేవారికి ముందురోజు మధ్యాహ్నం  1నుంచి అనుమతిస్తామని స్పష్టంచేశారు. మరోవైపు, రాష్ట్రంలో తాజా కరోనా కేసుల్లో అత్యధికంగా 181 కొత్త కేసులు చిత్తూరు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని