Viveka Murder case: భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

Updated : 19 Sep 2023 12:17 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాల రీత్యా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని