ఆ మహిళ.. ఒక మగాడు: పాతికేళ్లకు తెలిసిన నిజం!
ఆమెకు వివాహమై సంతోషకరమైన జీవితం గడుపుతోంది కానీ, పిల్లలు కలగట్లేదనే ఒకే ఒక్క బాధ. అందుకే, ఆ దంపతులు ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంతలో ఆమె కాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. తీరా
బీజింగ్: ఆమెకు వివాహమై సంతోషకరమైన జీవితం గడుపుతోంది కానీ, పిల్లలు కలగట్లేదనే ఒకే ఒక్క బాధ. అందుకే, ఆ దంపతులు ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంతలో ఆమె కాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. తీరా చూస్తే ఇన్నాళ్లు మహిళగా భావిస్తున్న ఆమె, అసలు మహిళే కాదని తేలింది. పురుషుడిగా జన్మించి జన్యులోపం కారణంగా మహిళగా మారిందని వైద్యులు గుర్తించారు. పాతికేళ్ల తర్వాత నిజం తెలుసుకొని మహిళతోపాటు అందరూ ఆశ్చర్యపోయారు. చైనాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
సాధారణంగా అమ్మాయిలకు కౌమరదశకు రాగానే రుతుస్రావం మొదలువుతుంది. కానీ, చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన పింగ్పింగ్ అనే అమ్మాయి విషయంలో అలా జరగలేదు. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. శరీరంలో ఎదుగుదల నెమ్మదిగా ఉందని.. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని చెప్పారట. ఆ ధీమాతో మహిళకు వివాహం చేశారు. అయితే, గతకొంతకాలంగా ఆమె సంతానం కోసం ప్రయత్నిస్తోంది. అయినా గర్భం దాల్చట్లేదు. కాగా, ఇటీవల ఆమె కాలికి దెబ్బతగలడంతో కుటుంబసభ్యులు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలికి ఎక్స్-రే తీయగా.. ఆమె శరీరంలో ఎముకలు ఎదగలేదని వైద్యులు గుర్తించారు. అనుమానం వచ్చి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో విస్తుపోయే విషయం తెలిసింది. వైద్య నివేదికలో ఆమెలో గర్భాశయం, అండాశయం లేదని కూడా తేలింది. ఆ మహిళ పుట్టడంతోనే సరిగా ఎదగని స్త్రీ, పురుష జననాంగాలతో పుట్టిందట. దీంతో బాహ్యశరీరం మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా ఆమె పురుషడని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఆమెకు రుతుస్రావం అవ్వట్లేదని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు ఒకే రక్తసంబంధం ఉన్న వాళ్లు కావడం వల్ల ఈ జన్యులోపం తలెత్తిందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!