Etala Rajender: భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత

హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 30 Jun 2023 21:50 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల మీడియా సమావేశంలో ఈటల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిన్న మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ రావు నిన్న ఈటలను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న డీసీపీ సందీప్‌.. డీజీపీకి సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు అంగరక్షకులు ఎప్పుడూ ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బందిలో షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున.. మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని