టీకా పంపిణీ: ప్రైవేటు కేంద్రాల్లో తెలంగాణ టాప్!
ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 60ఏళ్ల వారికే అనుమతి ఉండగా, ఏప్రిల్ ఒకటో తేదీనుంచి 45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించింది. ఇక ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 48.39శాతం టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. దేశ రాజధాని దిల్లీ(43.11శాతం) రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. ఇక్కడ ఇప్పటి వరకు 57లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (54.84లక్షలు), ఉత్తర్ప్రదేశ్ (53.03లక్షలు), గుజరాత్ (52.62లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 24లక్షలు, తెలంగాణలో 11లక్షల 75వేల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
855 కొత్తరకం కేసులు..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కొత్తరకం కరోనా కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 11,064 నమూనాలకు జీనోమ్ సీక్సెన్స్ నిర్వహించగా వీటిలో 855 కొత్తరకం కేసులు బయటపడినట్లు తెలిపారు. వీటిలో 807 బ్రిటన్ రకాలు, 47 దక్షిణాఫ్రికా రకం, మరొక నమూనాలో బ్రెజిల్ రకం కరోనాను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కొత్తరకం కరోనా వైరస్లపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. బ్రిటన్, బ్రెజిల్ రకాలపై ఈ టీకాలు పనిచేస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, దక్షిణాఫ్రికా రకంపై పరిశోధన కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మహారాష్ట్రలో 23శాతం పాజిటివిటీ రేటు..
ప్రస్తుతం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94శాతం ఉండగా, మరణాల రేటు 1.34శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు వారం సరాసరి 5.65శాతంగా ఉండగా, మహారాష్ట్రలో మాత్రం 23శాతంగా ఉందని పేర్కొంది. పంజాబ్(8.82శాతం), ఛత్తీస్గఢ్(8శాతం), మధ్యప్రదేశ్(7.82), తమిళనాడు(2.50), కర్ణాటక(2.45), గుజరాత్(2.2), దిల్లీ(2.04శాతంగా) రాష్ట్రాల్లోనూ కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ