గాలిలో వైరస్ వ్యాప్తి: CCMB కీలక అధ్యయనం!
కరోనా వైరస్ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తోందన్న విషయంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కీలకం అధ్యయనం ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తోందన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కీలక అధ్యయనం ప్రారంభించింది. ముఖ్యంగా గాలిలో వైరస్ వ్యాపిస్తుందా?లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. ఒకవేళ వ్యాపిస్తే..ఎంతసేపు, ఎంత దూరం దాని ప్రభావం ఉంటుందనే విషయాలను కనుగొనే పరిశోధనను సీసీఎంబీ మొదలుపెట్టింది.
గాలిలో వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. దీనిపై తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కానీ, గాలిలో వైరస్ వ్యాపిస్తోందనడానికి రుజువులున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. చివరకు దీన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్వో.. వెంటిలేషన్ లేని రద్దీ ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వైరస్ గాలిలో వ్యాపించడం సాధ్యమే అని అభిప్రాయపడింది. ఇక అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలణ కేంద్రాలు(సీడీసీ) కూడా గాలిలో వైరస్ వ్యాప్తిపై పలుసార్లు మార్గదర్శకాలను మార్చింది. ఈ సమయంలో సీసీఎంబీ చేపట్టిన తాజా పరిశోధన కీలకంగా మారనుంది.
ముఖ్యంగా ఆసుపత్రుల పరిసరాల్లో పాజిటివ్ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్ ఎలా సంక్రమిస్తుందో అని అంచనా వేసేందుకు సీసీఎంబీ ఈ పరిశోధన చేపట్టింది. పదిరోజుల క్రితమే ఈ అధ్యయనం ప్రారంభించామని.. ఒకవేళ గాలిలో వైరస్ వ్యాపిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం చేపట్టినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. కరోనా పోరులో ముందున్న వైద్యసిబ్బందికి సహాయం చేసేందుకే ఈ అధ్యయనం చేపట్టామని తెలిపారు. అయితే, వీటి ఫలితాలు వచ్చిన తర్వాత క్లోజ్డ్ హాళ్లు, బ్యాంకులు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిశోధన కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఎయిర్ శాంప్లర్లను ఏర్పాటు చేశారు. ఐసీయూ, కొవిడ్ వార్డులతోపాటు వైరస్ సంక్రమణకు వీలున్న ప్రదేశాల్లో వీటిని సేకరిస్తున్నారు. వీటి ద్వారా రెండు, నాలుగు, ఎనిమిది మీటర్ల దూరాల్లో వైరస్ ప్రభావాన్ని విశ్లేషించనున్నారు. తద్వారా గాలిలో వైరస్ ఎంతసేపు ఉంటుందో తెలుసుకోవడంతోపాటు ఎంత దూరం ప్రయాణించగలదనే విషయాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైద్య, ఆరోగ్యసిబ్బంది వైరస్ బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన వ్యూహాన్ని రచించేందుకు తాజా అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భౌతిక దూరం, మాస్కులపై మరిన్ని మార్గదర్శకాలు రూపొందించే ఆస్కారం ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు తొందరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!