రూ.6 లక్షల కోట్లు దాటిపోతుంది
కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఆర్బీఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి అన్నివర్గాల రుణగ్రహీతల అన్ని రకాల రుణాలపై వడ్డీని రద్దు చేసినట్లైతే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది.............
అన్ని రకాల రుణాల వడ్డీ రద్దుపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
మరిన్ని ఉపశమన చర్యలను ఆర్థిక రంగం భరించలేదని స్పష్టీకరణ
దిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఆర్బీఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి అన్నివర్గాల రుణగ్రహీతల అన్ని రకాల రుణాలపై వడ్డీని రద్దు చేసినట్లైతే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఒకవేళ బ్యాంకులు ఈ మొత్తాన్ని భరించినట్లైతే అవన్నీ తప్పనిసరిగా తమ నికర విలువలో ఎక్కువ భాగాన్ని తుడిచిపెట్టేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా ఆర్థిక సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఆశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డిల సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. వడ్డీ మాఫీ అంశం గురించి ఆలోచించకపోవడానికి, వాయిదా మొత్తాల చెల్లింపును మాత్రమే వాయిదా వేయడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రంగాల వారీగా ఉపశమన చర్యలు చేపట్టాలంటూ స్థిరాస్తి, విద్యుత్తు రంగాల సంస్థలు సహా వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమర్పించిన అంశాల వివరాలను మెహతా చదివి వినిపించారు. మారటోరియం కాలానికి సంబంధించి అన్ని రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని చెప్పారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కనుక వడ్డీని రద్దు చేస్తే.. ఆ బ్యాంకు 65 సంవత్సరాలుగా కూడబెట్టుకున్న విలువలోని సగ భాగం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. ‘‘డిపాజిట్ చేసినవారికి వడ్డీ చెల్లింపులు కొనసాగించడం అత్యవసర బ్యాంకింగ్ కార్యకలాపం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా నెరవేర్చాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది చిన్న డిపాజిట్దారులు, పింఛనర్లు. వీరంతా తమ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఆధారపడి జీవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన మారటోరియం కాలానికి సంబంధించి ఎస్బీఐ రుణగ్రహీతల నుంచి వసూలు చేయాల్సిన వడ్డీ సుమారు రూ.88,078 కోట్లుగా ఉండగా, డిపాజిటర్లకు చెల్లించాల్సిన వడ్డీ సుమారు రూ.75,157 కోట్లుగా ఉందని భారతీయ బ్యాంకుల సంఘం సెప్టెంబర్ 25న దాఖలుచేసిన ప్రమాణపత్రాన్ని ఈ సందర్భంగా మెహతా ప్రస్తావించారు. కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్రం అనేక ఉపశమన చర్యలు చేపట్టిన సంగతిని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇక మరిన్ని ఉపశమన చర్యలు అంటే.. దేశ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని, దేశ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు ఆ పరిస్థితిని తట్టుకోలేవని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా