Pandora Papers: చరిత్రలోనే అనైతిక సంపాదన వివరాల అతిపెద్ద లీకేజీ..!
పాండోరా పేపర్లు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత దేశాన్ని కాదని పన్నుతక్కువ ఉన్న విదేశాలకు సంపద తరలించిన వారి వివరాల గుట్లు రట్టైంది.
* అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాండోరా పేపర్లు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత దేశాన్ని కాదని పన్నుతక్కువ ఉన్న విదేశాలకు సంపద తరలించిన వారి వివరాల గుట్టు రట్టైంది. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) విడుదల చేసిన ఈ పేపర్లను బట్టి ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో దాచిన సొమ్ము మొత్తం విలువ కనీసం 5.6 ట్రిలియన్ డాలర్ల నుంచి అత్యధికంగా 32 ట్రిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని ఐసీఐజే అంచనా వేసింది. పన్ను తక్కువ ఉన్న దేశాలకు తరలించే సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలకు ఏటా 600 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. 117 దేశాల్లోని 600 మంది జర్నలిస్టుల సమష్టిగా పనిచేసి ఈ గుట్టు రట్టు చేశారు.
డేటా సునామీ..
మొత్తం 14 సోర్సుల నుంచి 64,06,119 పత్రాలు, 29,37,513 చిత్రాలు, 12,05,716 ఈమెయిల్స్, 4,67,405 స్ప్రెడ్షీట్లు, 8,86,923 ఇతర ఆధారాలను ఐసీఐజే బహిర్గతం చేసింది. ఈ డేటా మొత్తం 2.94 టెరాబైట్లు ఉంది.
ఇది ఎందుకు భిన్నమైంది?
2016లో విడుదలైన పనామా పేపర్ల డేటా 2.6 టెరాబైట్లు మాత్రమే. ఈ డేటా కూడా ఒక్కేఒక్క సోర్స్ నుంచి వచ్చింది. ఇక 2017లో ప్యారడైజ్ పేపర్లలో 1.4 టెరాబైట్ల డేటా బయటకు వచ్చింది. ఇది కూడా విదేశాల్లోని ఒక లా కంపెనీ నుంచి సంపాదించినదే. కానీ, ఈ సారి 14 సోర్సుల నుంచి వివిధ మార్గాల్లో సమాచారాన్ని జాగ్రత్తగా సమీకరించారు. మొత్తం 27 వేల కంపెనీల్లోని 29వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ సంఖ్య పనామా పేపర్లతో పోలిస్తే రెట్టింపు. ఈ సమాచారం ఇంగ్లిష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచి, అరబిక్, కొరియాన్ భాషల్లో ఉంది. భారత్ నుంచి ఆరుగురు రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఉన్నట్లు ఐసీఐజే వెబ్సైట్ పేర్కొంది.
ఆఫ్షోర్ కంపెనీలు ఏమిటీ..?
ఈ పేపర్లలో అత్యంత క్లిష్టమైన కంపెనీల నెట్వర్క్లను వెలుగులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ కంపెనీల సంపద, యాజమాన్యాల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి యూకేలో ఒక ఆస్తి ఉంది. కానీ, విదేశాల్లో ఉన్న గొలుసుకట్టు కంపెనీల లావాదేవీలతో దానిని సొంతం చేసుకోవచ్చు. ఈ విదేశీ కంపెనీలను ‘ఆఫ్షోర్’గా వ్యవహరిస్తారు.
ఈ ఆఫ్షోర్ కంపెనీల ఏర్పాటుకు కొన్ని రకాల దేశాలను ఎంచుకొంటారు. కంపెనీ ఏర్పాటు నిబంధనలు సులభతరంగా ఉండాలి, కంపెనీ యాజమాన్యాలను గుర్తించకుండా కఠిన చట్టాలు ఉండాలి. కార్పొరేట్ పన్ను అతి తక్కువ లేదా అసలు ఉండకూడదు. సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కైమన్ ఐలాండ్స్ వంటి దేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
ఆయా దేశాల్లోని చట్టాల్లోని లొసుగులను వాడుకొని కంపెనీలను ఈ దేశాలకు తరలిస్తారు. చాలా చోట్ల చట్టపరంగా ఇది తప్పుకాకపోయినా.. అనైతికం. ఈ దేశాల్లో కేవలం పేర్లతో పేపర్లపై కంపెనీలను సృష్టిస్తారు. ఇలాంటి సేవలు అందించడానికి ప్రత్యేకంగా కంపెనీలు ఉన్నాయి.
గత దశాబ్ద కాలంలో కీలక లీకులు..
* నవంబర్ 2012, ఏప్రిల్ 2013ల్లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్లో పెట్టుబడులపై ఇద్దరు ఫైనాన్షియల్ ప్రొవైడర్ల నుంచి సంపాదించిన డేటాను ఐసీఐజే లీక్ చేసింది. 25లక్షల ఫైల్స్లో 1,20,000 కంపెనీల గుట్టు ఉంది.
* నవంబర్ 2014లో ఐసీఐజే లక్సమ్బర్గ్ లీక్స్ పేరిట కొన్ని పత్రాలను విడుదల చేసింది. వీటిల్లో ప్రైస్వాటర్హౌస్ కూపర్స్ సంస్థ చాలా ఎంఎన్సీలకు 2002 నుంచి 2010 వరకు లక్సమ్బర్గ్లో పన్ను రాయితీలను ఇప్పించిన జాబితా ఇది. వీటిల్లో ఐకియా,పెప్సీ,ఏఐజీ,దాయిషే బ్యాంక్ వంటి దిగ్గజాలు ఉన్నాయి.
* ఐసీఐజే 2015లో స్విస్ లీక్ పేరుతో బహిర్గతం చేసిన 200 దేశాల్లో లక్ష మంది వ్యక్తులు, అక్రమ కంపెనీల డేటా దీనిలో ఉంది. ఆయుధ డీలర్లు, వెనుకబడిన దేశాల్లోని నియంతలు, వజ్రాల అక్రమ రవాణాదారుల వివరాలు ఉన్నాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నిముబారక్, సిరియా నేత బషర్ అల్ అసద్ పేర్లున్నాయి.
* 2016లో లీకైన పనామా పేపర్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 2010 డిప్లొమాటిక్ వికీలీక్స్ కేబుల్స్ కంటే 1500 రెట్లు అధిక డేటాను బహిర్గతం చేసింది. మొస్సాక్ ఫొన్సెకా అనే సంస్థ నుంచి సంపాదించిన 2.6 టెరాబైట్ల డేటా ఇది. రష్యా అధినేత పుతిన్ సన్నిహితులు, డజను మంది ప్రపంచ నేతలు, 120 రాజకీయ నాయకులు, లెక్కలేనంత మంది బిలియనర్ల వివరాలు దీనిలో ఉన్నాయి.
* 2017లో ఆఫ్షోర్ లా సంస్థ యాపిల్బై, 19 దేశాల్లోని కార్పొరేట్ రిజిస్ట్రీల వివరాలను ప్యారడైజ్ పేపర్ల పేరిట విడుదల చేశారు. వీటిల్లో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాలు, బిజినెస్ టైకూన్ల లావాదేవీలు ఉన్నాయి.
* సెప్టెంబర్ 2020లో ఫిన్సిన్ ఫైల్స్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ బ్యాంకులు.. మనీలాండరింగ్, నేరాలకు ఆర్థిక సహకారం అడ్డుకోవడంలో ఎలా విఫలమయ్యాయో వివరాలను లీక్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్