Corona Updates: బెంగళూరుపై ఒమిక్రాన్ పంజా.. దిల్లీలో2500మంది పోలీసులకు కొవిడ్!
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభిస్తోంది......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పలు రాష్ట్రాలు చర్యలు తీసుకొంటున్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితిపై కొన్ని అప్డేట్స్..
బెంగళూరులో ఒకేరోజు 287 ఒమిక్రాన్ కేసులు
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో భారీగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ ఒక్కరోజే 287 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి పెరిగిందన్నారు. అలాగే, ఉత్తరాఖండ్లోనూ భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 85 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
దిల్లీలో 2500మంది పోలీసులకు కరోనా
దిల్లీలో కరోనా ఉగ్రరూపం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇటీవల గరిష్ఠస్థాయిలో నమోదైన కేసుల సంఖ్య గణనీయంగా దిగి వస్తోంది. అయితే, జనవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది పోలీసులు కొవిడ్ బారిన పడినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. అదనపు పోలీస్ కమిషనర్ (క్రైం) చిన్మోయ్ బిశ్వాల్ కూడా కొవిడ్ బారిన పడగా ఆయన కోలుకొని ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆయనతో పాటు దాదాపు 767 మంది సిబ్బంది కొవిడ్ నుంచి కోలుకొని విధులకు వస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, దిల్లీ పోలీసులు అన్ని ర్యాంకుల సిబ్బంది కోసం బూస్టర్ డోసు అందించేందుకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. దిల్లీలో దాదాపు 80వేలకు పైగా పోలీసు సిబ్బంది ఉన్నట్టు దిల్లీ పోలీస్ పీఆర్వో వెల్లడించారు.
ఒడిశాలో 982మంది చిన్నారులకు కొవిడ్
ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 688 కేసులు తగ్గినప్పటికీ పిల్లలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో 982 మంది చిన్నారులు కొవిడ్ బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు గడిచిన 24గంటల వ్యవధిలో 70,117 టెస్టులు చేయగా.. 10,489 కొత్త కేసులు వెలుగుచూశాయి. అలాగే, కొవిడ్ బాధితుల్లో 4452మంది ఆదివారం కోలుకోగా.. ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75,797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఖుర్దాలో 24,764 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాట విద్యార్థులకు 100శాతం తొలి డోసు పూర్తి
వ్యాక్సినేషన్లో తమిళనాడు కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులందరికీ తొలిడోసు పూర్తయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు, దేశంలో జనవరి 3నుంచి ఇప్పటివరకు 3.5కోట్ల మందికి పైగా టీనేజర్లకు తొలి డోసు పూర్తయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వాయిదా
తిరువనంతపురం: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వాయిదా వేసింది. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు జరగాల్సిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్